Tuesday, May 20, 2014

శ్యామచంద్ర గజ రాజు

"ధనమేరా అన్నిటికీ మూలం" అన్నాడు సినీ గీతకారుడు.
బొమ్మా బొరుసా- అనే తెలుగు సినిమా,
కథా బలముతో సినీ విమర్శకుల ప్రశంసలను పొందింది.
ఎస్. వరలక్ష్మి నటన హైలైట్. పందెం కట్టి, పంతం పట్టి
ఆమెను చంద్రమోహన్, చలం,
(భర్త ముక్కామల, కుమార్తె వెన్నిరాడై నిర్మల) ఎలా ఓడించారు?-
అనే అంశముతో
అనేక ఆసక్తిదాయక మలుపులతో సాగిన చలన చిత్రము అది.
1971 లో రిలీజ్ ఐన "బొమ్మా బొరుసా" (Heads or Tails)-
కె. బాల చందర్ దర్శకత్వ ప్రతిభకు గీటురాయి.

daalphin fish


*******************
రూపాయి- అంటే నోట్లో వేలు వేస్కుని,
చీకుతూండే పసిపాపాయికి కూడా తెలుసు.
"ధనమూలమిదం జగత్"- అనిన్నీ,
"డబ్బుకు లోకం దాసోహం"- ఇలాంటి సామెతలతో-
ధనమునకు ఉన్న విలువ వెల్లడి ఔతూనే ఉన్నది.
రూకలు, వరహాలు, దీనార టంకములు, మొహిరీలు లాంటి పేర్లు
బి.సి.  నాటి నుండీ వినియోగములో ఉన్నవే!
“పైస మే పరమాత్మా హై”
అంతెందుకు, క్రికెట్టు వగైరా క్రీడలలో –
ఏ టీము ముందు ఆడాలో నిర్ణయించేది
ఈ కాసుకి - రెండు వైపులా ముద్రించబడి ఉన్న- బొమ్మా- బొరుసులే!
మనము ఇప్పుడు వాడుతూన్న “రూపాయి” రూపానికి
ప్రతిరూపమునకు మూల కారణము షేర్ షా.

*****************;

షేర్ షా సూరి  కాలం నాటికి అనేక రూపాలలో- ద్రవ్య వినిమయాలు ఉండేవి.
వస్తు మారక పద్ధతి, బంగారు, వెండి నాణెములు, తోలుపై ముద్రణలతో,
కాసులు, మున్నగునవి విపణివీధిలో చలామణీ ఔతూండేవి.
అప్పటికి “రూపయ్య”/ రుపయ్యా- Rupee
(బ్రిటీషు వారి పలుకుబడిలో అదే “రుపీ” అనే పేరును కూడా పొందింది)
ఏ వెండి నాణెము అయినా – రూపాయి- అనే చెప్పబడేది. వ రించి
దేనినైనా నాణెము- రుపయ్యా - అని ప్రజలు చెప్పేవారు.
అయినప్పటికీ - షేర్ షా డిజైన్ చేసిన పద్ధతి- గుర్తించబడినదని చెపవచ్చును.
షేర్ షా వెండి కాయిన్ కు ఉండవల్సిన బరువును నిర్ధారించాడు.
షేర్ షా నిర్ణయించిన రజత నాణెము బరువు పరిశీలనకు నిలిచి,
తర్వాతి వారు- ఆ ప్రామాణికతనే గైకొన్నారు.
178 గింజల బరువు సిల్వర్ కాయిన్ ది.
షేర్ షా బంగారు నాణెము బరువు – 169 గింజల ఎత్తు-అని నిర్ణయించాడు.
అలాగే షేర్ షా రాగి నాణాలకు ఉండాల్సిన బరువును నిర్ధారించి,
రాగి నాణెమును- “దం” అని చెప్పేవాళ్ళు.
స్వర్ణ నాణెమును “మొహర్” అని చెప్పారు.
మన ఇండియాలోనే కాక, నేపాల్. శ్రీ లంక, ఇండొనేషియా,
మారిషస్, మాల్ దీవులు, సిషిల్లెస్ దేశాలలో –
“జాతీయ కరెన్సీ” ( National Currency) రూపాయి/ రుపీ.
షేర్ షా దూర దృష్టికి దృష్టాంతము- నేటికి ఆయా దేశాల ప్రభుత్వాలూ, గవర్నమెంట్సూ -
షేర్ షా డిసైడ్ చేసిన బరువునే “స్టాండర్ద్ గా అనుసరించడమే
షేర్ షా  దక్షతకు నిదర్శనము.

షేర్ షా సూరి  1540 నుండి 1545 వరకూ పాలన చేసాడు.
ఆ అయిదు ఏళ్ళలో అతను ప్రవేశపెట్టిన సంస్కరణలు –
హుమాయూన్ కుమారుడు అక్బర్ కు రాజ్య పాలనకు,
సుపరిపాలనకు గట్టి పునాదులను అందించాయి.
నేటి ఇండియాలో కూడా అవి అనుసరించబడుతూన్నవి.
టాపాలా పద్ధతి, రూపాయి నాణెము అమలులోనికి వచ్చుట,
గ్రాండ్ ట్రంక్ రోడ్ ల నిర్మాణాలకు – సుగమమార్గములను ఏర్పరిచినవి.
షేర్ షా రూపకల్పనలు చేసి, అప్పటికప్పుడు- వాటిని అమలు అయ్యేలా చేయగలిగాడు.
ఈ కొత్త పద్ధతులు- ఆధునిక గవర్న్ మెంటుల ప్రభుత్వ కార్యక్రమాల
మెయింటినెన్సులు సజావుగా జరగడానికి మూలస్తంభాలు ఐనవి.

**************************************;

షేర్ షా సూరి  జీవితంలో ఒక విచిత్ర సంఘటన జరిగినది.
షేర్ షా జార్ ఖండ్ పైకి దండెత్తాడు.
ఆ సీమ బంగారం, వెండి వంటి అనేక ఖరీదైన ఖనిజాలకు నెలవు.
అందువలనఇతర రాజుల కన్ను ఈ ప్రాంతం పై ఉండేది.
తరచూ దండయాత్రలకు గురి ఔతూండేది.
కానీ షేర్ షా దండెత్తి రావడానికి మాత్రం
వింత కారణమొకటి ఉన్నది. అది,
అతను ఒక ఏనుగు కోసమై జార్ ఖండ్ పై
పోరుకు సిద్ధపడ్డాడు.
జార్ ఖండ్ రాజు వద్ద "శ్యామ చంద్ర" అనే తెల్ల ఏనుగు ఉన్నది.
శ్యామ చంద్ర - అంటే నల్ల చంద్రుడు - అని అర్ధము.
సాధారణ గజములు,తమ తొండములలో మట్టిని పూరించి,
తన దేహములపైన చల్లుకుంటాయి.
ఐరావతము జాతికి చెందినట్టి
ఈ జార్ ఖండ్ రాజా గారి శ్వేత హస్తి
అలాగ ఇసుకను తన ఒడలుపై వెదజల్లుకోక-
శుభ్రంగా ఉంచుకుంటుంది.
ఈ "శ్యామచంద్ర గజ రాజు" - భాగ్య దాయిని-
అనే నమ్మకము బహుళ వ్యాప్తిలో ఉన్నది.
షేర్ షా- కూడా- ఈ విశ్వాసముతో- పోరుకు రెడీ ఐనాడు.
"ఈ శ్యామ చంద్ర ఏనుగు  తన వద్ద ఉంటే-
తనకు ఢిల్లీ సింహాసనము హస్తగతమౌతుంది" అని అనుకున్నాడు.
అలాగ అతడు ఆ ఏనుగును స్వంతము చేసుకున్నాడు.
అటు తర్వాత ఆతని కోరిక నెరవేరింది కూడా!
;
(దీనార టంకములు

No comments:

Post a Comment